Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కందుకూరు : నియోజకవర్గంలో ఇప్పటివరకు 667. మంది లబ్ధిదారులకు ₹.5.40 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబునాయుడుకి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు.ఆదివారం ఉదయం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పేద ప్రజల ఉద్దరనే ప్రధాన ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారన్నారు. కేవలం 14. మాసాల్లోనే నియోజకవర్గానికి ఇతోధికంగా 667. మందికి ₹.5.40 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం ముదావహం అన్నారు. *75. సంవత్సరాల వయసులో కూడా 24. గంటలు ప్రజా సంక్షేమం కోసం నిరంతరాయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు ఆ దేవదేవుడు దీర్ఘాయుష్షును ప్రసాదించాలని ఎమ్మెల్యే ఇంటూరి ఆకాంక్షించారు. కందుకూరు నియోజకవర్గ ప్రజలకు, తాను ఒక సోదరుని మాదిరిగా నిరంతరాయం తమ కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే ఇంటూరి కృతజ్ఞతాపూర్వకంగా తెలిపారు. .వచ్చే ఏడాది జూన్ నాటికి వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి, ఉమ్మడి ప్రకాశం జిల్లాకు జలసిరులు అందించడమే తన ప్రధాన ప్రాధాన్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పని చేస్తున్నారన్నారు.దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కానీ సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్లో అమలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఈ సందర్భంగా తెలియజేశారు. 41. మందికి ₹.23.70 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి, జనిగర్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు
Admin
Amaravathi Jyothi