Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : ఐఎంఏ ఆధ్వర్యంలో వరల్డ్ ఎయిడ్స్ డే అవగాహన ర్యాలీ కావలి,అమరావతి జ్యోతి: నెల్లూరు జిల్లా కావలి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో "వరల్డ్ ఎయిడ్స్ డే దినోత్సవం" సందర్భంగా ఉమెన్ డాక్టర్స్ వింగ్ - కావలి, రెడ్ క్రాస్ సొసైటీ - కావలి, జనవిజ్ఞాన వేదిక -కావలి,టీమ్ సేవియర్స్, శ్రీ చైతన్య డిగ్రీ కళాశాల వారి సహకారంతో కావలి పట్టణం శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహం కూడలి వద్ద నుంచి ఆర్. డి .ఓ ఆఫీస్ వరకు ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆర్ టి సి బస్ స్టాండ్ కూడలి వద్ద మానవహారం చేపట్టి ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఐ యమ్ ఎ ప్రెసిడెంట్ డాక్టర్ కె. సుబ్బారావు, సెక్రటరీ డాక్టర్ వి గోపి,ట్రెజరర్ డాక్టర్ పి.శివప్రసాద్, డాక్టర్ బెజవాడ రవికుమార్, డాక్టర్ మంచిగంటి.రామస్వామి, డాక్టర్ ఎన్ ప్రభాకర్ నాయుడు, డాక్టర్ పి శ్రీధర్, డాక్టర్ మనోహర్ బాబు , డాక్టర్ ఉషారాణి, డాక్టర్ సరళ దేవి, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ అల్లం శ్రీనివాసులు మరియు ఇతర వైద్యులు, రెడ్ క్రాస్ సొసైటీ నుంచి డాకారపు.రవి ప్రకాష్,సుధీర్ నాయుడులు, జనవిజ్ఞాన వేదిక ప్రెసిడెంట్ తోట వెంకటేశ్వర్లు, హరినాథ్ రెడ్డి, టీమ్ సేవియర్స్ సభ్యులు,శ్రీ చైతన్య డిగ్రీ కళాశాల యాజమాన్యం మరియు విద్యార్థులు,జమీర్, మొగల్ సలీం, మాలకొండయ్య మరియు వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సుమారు 250 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బెజవాడ రవి కుమార్, డాక్టర్ కె. సుబ్బారావు లు మాట్లాడుతూ ఎయిడ్స్ నివారణ మన చేతుల్లోనే ఉందని, నివారణపై అవగాహన పెంచుకోని సమాజాన్ని రక్షించుకోవాలే గానీ, లేని పోని అపోహాలు పెంచుకోని సమాజాన్ని విచ్చిన్నం చేయకూడదని తెలిపారు. ఎయ డ్స్ వ్యాధిని స్క్రీనింగ్ పద్ధతిలో కనుగొని సకాలంలో వైద్యం అందిస్తే వ్యాధి తీవ్రత తగ్గుతుంది అని తెలిపారు. స్క్రీనింగ్ మరియు వైద్యం కావలి ఏరియా హాస్పిటల్ నందు ఉచితంగా అందిస్తారని తెలిపారు. సురక్షితమైన సెక్స్ కచ్చితంగా పాటించాలని వివరించారు. ఎయిడ్స్ సోకిన వ్యక్తిని ద్వేశించకుండ వారికి తగిన సహాయాన్ని మరియు అవగాహన కల్పించి మనో ధైర్యాన్ని ఇవ్వాలని కోరారు.
Admin
Amaravathi Jyothi