Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : పొన్నలూరులో వైసిపికి భారీ షాక్ పొన్నలూరు,అమరావతి జ్యోతి : వైయస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పరిపాలన మీద విరక్తి చెందిన పలువురు వైసీపీకి చెందిన పొన్నలూరు గ్రామం నుండి 200 మంది తూర్పు నాయుడుపాలెంలోని దామచర్ల సత్య క్యాంప్ ఆఫీస్ లో ఆదివారం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా దామచర్ల సత్య మాట్లాడుతూ 2024లో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం తద్యమన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సమచిత గౌరవం ఉంటుందని ఈ 15 రోజులు ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన వారిలో పొన్నలూరు మండల వైసీపీ సీనియర్ నాయకులు పొన్నలూరు గ్రామ మాజీ సర్పంచ్ పల్లపోతు ప్రసాద్, గడ్డం మాధవరావు, గడ్డం మురళి, మండవ కృష్ణారావు, గడిపూడి ప్రసాద్, గడిపూడి సుందర్రావు, గడిపూడి శ్రీకాంత్, గడిపూడి వీరనారాయణ, గడిపూడి తిరుమల నాయుడు, పల్లపోతు దత్తాత్రేయ, పాలడుగు మాల్యాద్రి,, పొదిలి వెంకటేశ్వర్లు, కొత్తకోట మాధవ, దగ్గు మారవ, తన్నీరు మల్యాద్రి, పోతినేని ఓంకారం తోపాటు వారు వారి కుటుంబాలకు చెందిన 200 మంది టిడిపిలో చేరగా వారికి దామచర్ల సత్య కండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు అనుమోలు సాంబశివరావు, మాజీ ఎంపీపీ కొండ్రగుంట శ్రీనివాసరావు, మాజీ అధ్యక్షులు మండవ ప్రసాద్, సీనియర్ నాయకులు కర్ణ కోటిరెడ్డి, గుమ్మల్ల వెంకట్రావు, రాష్ట్ర రైతు కార్యదర్శి రాఘవరెడ్డి, పల్లపోతు కోటేశ్వరరావు, వల్లపోతు మాధవ తదితరులు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi