Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : లింగాసముద్రం: రాళ్ళపాడు రిజర్వాయర్ గరిష్ట నీటిమట్టం ఆదివారం ఉదయానికి దాదాపుగా నిండింది. గరిష్ట నీటిమట్టం 20 అడుగులు కాగా.. ప్రస్తుతం 19.11 అడుగులకు నీరు చేరిందని DE వెంకటేశ్వరరావు తెలిపారు. మరో అంగుళం నీటిమట్టం పెరిగితే రిజర్వాయర్ పూర్తిస్థాయిలో నిండుతుందన్నారు. ఇన్ ఫ్లో 120 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 55 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 1.11TMCలు కాగా ప్రస్తుతం 1.09TMCల నీటితో 98.20% నిండింది.
Admin
Amaravathi Jyothi