Amaravathi Jyothi - Telagana / Hyderabad : శుక్రవారం ప్రజాదర్బార్.. సీఎంగా రేవంత్ తొలి ప్రసంగం ఇదే.. హైదరాబాద్,అమరావతి జ్యోతి:: తెలంగాణ ప్రజలకు ఇవాళే స్వేచ్ఛ లభించిందని.. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకే ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు..ఎల్బీ స్టేడియంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రజలను ఉద్దేశించింది తొలిసారి ఆయన మాట్లాడారు. 'ప్రజా ప్రభుత్వం ఏర్పాటుతో ఇక అంతటా సమానాభివృద్ధి సాధ్యం. తెలంగాణ ఆషామాషీగా ఏర్పడిన రాష్ట్రం కాదు. పోరాటాలతో త్యాగాలే పునాదులుగా ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ. పదేళ్లుగా నిరంకుశత్వాన్ని రాష్ట్ర ప్రజలు మౌనంగా భరించారు. ఇప్పటికే ప్రగతిభవన్ ముందు ఉన్న ఇనుప కంచెలను బద్దలు కొట్టించాం. సంక్షేమం, అభివృద్ధి రాష్ట్రంగా తెలంగాణను తీర్చుదిద్దుతాం. శుక్రవారం ఉదయం 10 గంటలకు జ్యోతిరావుపూలే ప్రజాభవన్లో ప్రజాదర్బార్ నిర్వహిస్తాం. మీ బిడ్డగా.. మీ సోదరుడిగా మీ బాధ్యతలను నేను నిర్వహిస్తా. మేం పాలకులం కాదు.. మీ సేవకులం. కార్యకర్తల కష్టాన్ని, శ్రమను గుర్తుపెట్టుకుంటా. పదేళ్లుగా కష్టపడిన కార్యకర్తలను గుండెల్లో పెట్టి చూసుకుంటా. విద్యార్థి, నిరుద్యోగ, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేస్తా'' అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
Admin
Amaravathi Jyothi