Amaravathi Jyothi - Telagana / Hyderabad : సీపీఆర్ఓగా అయోధ్య రెడ్డి హైదరాబాద్, అమరావతి జ్యోతి: ముఖ్యమంత్రి కార్యాలయం సీపీఆర్ఓగా(చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్)గా సీనియర్ పాత్రికేయులు అయోధ్యరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీర్ఘకాలంపాటు ప్రింట్ మీడియాలో పనిచేసిన అయోధ్యరెడ్డి కొంతకాలం క్రితం యాక్టివ్ జర్నలిజం నుంచి తప్పుకున్నారు. పీసీసీ చీఫ్గా రేవంత్రెడ్డి నియమితులైన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి.. క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో ఆయనను సీపీఆర్వోగా నియమిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీచేసింది.
Admin
Amaravathi Jyothi