Amaravathi Jyothi - Telagana / Hyderabad : హెచ్ఎండిఏ కమిషనర్ గా కాట ఆమ్రపాలి హైదరాబాద్, అమరావతి జ్యోతి: తెలంగాణలో పలువురు ఐఏఎస్లు బదిలీ అయ్యారు. రాష్ట్రంలోని పలు శాఖలకు చెందిన ఉన్నతాధికారులను సర్కార్ గురువారం బదిలీ చేసింది.ఈ మేరకు 14వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండీఏ కమిషనర్గా అమ్రపాలిని నియమించింది..అగ్రికల్చర్ డైరెక్టర్గా బి.గోపి.. ట్రాన్స్కో, జెన్కో ఛైర్మన్ అండ్ ఎండీగా రిజ్వి..డిప్యూటీ సీఎం ఓఎస్ డీగా ఐఏఎస్ కృష్ణభాస్కర్.. ఎస్పీడీసీఎల్ సీఎండీగా ముషారఫ్ అలీ..ఆరోగ్య శాఖ కమిషనర్గా శైలజా రామయ్యర్, ట్రాన్స్ కో జేఎండీగా సందీప్ కుమార్ ఝా,..టీఎస్ఎన్పీ డీసీఎల్ సీఎండీగా వరుణ్ రెడ్డి,నియామకం అయ్యారు.
Admin
Amaravathi Jyothi