Amaravathi Jyothi - National / SPSNellore : *దేశంలో 19 న తొలి దశ లోక్సభ పోలింగ్* న్యూ ఢిల్లీ,అమరావతి జ్యోతి: భారతదేశంలొ 19న ఓట్ల పండుగ ప్రారంభం కానుంది. సార్వత్రిక ఎన్ని కల తొలి దశ పోలింగ్కు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. తొలి దశలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని మొత్తం 102 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. తమిళనాడులోని మొత్తం 39 స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరుగుతాయి. తొలి విడతలో పోటీ చేస్తున్న కీలక నేతల్లో 8 మంది కేంద్రమంత్రులు, ఇద్దరు మాజీ ముఖ్యమం త్రులు, ఒక మాజీ గవర్నర్ ఉన్నారు. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ నాగపూర్ బరిలో ఉన్నారు. కిరణ్ రిజిజు అరుణాచల్ వెస్ట్ నుంచి, సర్వానంద సోనోవాల్ దిబ్రూగఢ్ నుంచి పోటీ చేస్తున్నారు. జితేంద్ర సింగ్ ఉదంపూర్ నుంచి, భూపేం ద్ర యాదవ్ రాజస్థాన్లోని అల్వార్ లోక్సభ స్థానంలో పోటీ చేస్తున్నారు. అర్జున్ రామ్ మేఘ్వాల్ బికనీర్ బరిలో, మురుగన్ నీలగిరి బరిలో నిలిచారు. ఇక కాంగ్రెస్ అగ్రనేత చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం శివగంగా నుంచి, తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై కోయంబ త్తూరు నుంచి, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై చెన్నై సౌత్ నుంచి పోటీ చేస్తున్న
Admin
Amaravathi Jyothi