Amaravathi Jyothi - National / : అమరావతే ఏపీ రాజధాని స్పష్టం చేసిన కేంద్రం ఢిల్లీ,అమరావతి జ్యోతి: అమరావతే ఏపీ రాజధాని అని కేంద్రం స్పష్టం చేసింది.అమరావతి మాస్టర్ ప్లాన్ ఆమోదించినట్లు వెల్లడించింది.దేశంలోని 28 రాష్ట్రాల రాజధానుల జాబితాను విడుదల చేసిన కేంద్రంఅందులో ఏపీ రాజధానిగా అమరావతికి స్థానం.పార్లమెంటు సాక్షిగా అమరావతే ఏపీ రాజధాని అన్న కేంద్రం.రాజ్యసభలో ఎంపీ జావెద్ అలీఖాన్ అడిగిన ప్రశ్నకు కేంద్రం స్పష్టమైన సమాధానం.దేశంలోని 39శాతం రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ లేదన్నది నిజమా? కాదా? అని ప్రశ్నించిన ఎంపీ.ఎంపీ జావెద్ అలీఖాన్ అడిగిన ప్రశ్నకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ సమాధానం రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ లేదన్న మాట అవాస్తమన్న కేంద్రం.ఏపీ రాజధాని అమరావతితో సహా 26 రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ ఉందన్న కేంద్రం. త్రిపుర రాజధాని అగర్తల, నాగాలాండ్ రాజధాని కోహిమాలు మినహా మిగతా రాజధానుల మాస్టర్ ప్లాన్ లను ఆమోదించినట్లు తెలిపిన కేంద్రం.
Admin
Amaravathi Jyothi