Amaravathi Jyothi - National / SPSNellore : ఆగిన అభివృద్ధిని కొనసాగించాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించాలి బెంగళూరు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఏ కష్టం వచ్చినా ఎల్లవేళలా అందుబాటులో ఉంటా బెంగళూరు నగరంలో నివసిస్తున్న ఉదయగిరి నియోజకవర్గ ప్రజల ఆత్మీయ సమావేశ కార్యక్రమ ముఖ్యఅతిథిగా పాల్గొన్న బొల్లినేని వెంకట రామారావు బెంగళూరు, అమరావతి జ్యోతి: ఉదయగిరి నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బొల్లినేని వెంకట రామారావు గారి అధ్యక్షతన బెంగళూరు నగరం కళ్యాణ్ నగర్ లో గల కొంకణ్ సముదాయ భవనం నందు ఉదయగిరి నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ నాయకుల కార్యకర్తల ఆత్మీయ సమావేశ ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది కార్యక్రమంలో బెంగళూరులో వ్యాపార ఉద్యోగరీత్యా తమ జీవనోపాధి కోసం వచ్చిన వారు దాదాపు పెద్ద ఎత్తున 1500 మంది హాజరవడం జరిగింది కార్యక్రమంలో బొల్లినేని మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీ అభిమానంతో ఈ కార్యక్రమమునకు వచ్చిన నియోజకవర్గ తెలుగు ప్రజల ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా సంతోషం అని అన్నారు ముఖ్యంగా ఈ సమావేశానికి గల కారణం గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మాత్రమే ఉదయగిరి నియోజకవర్గం లో 2014 -2019 మధ్య ఉదయగిరి, వింజమూరు పట్టణాలలో హాస్పిటలతో సబ్ స్టేషనన్స్, నియోజకవర్గానికి మూడు నేషనల్ హైవేలు తెచ్చిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీకే చెందుతుందని, కొండాపురం మండలంలో చింతల దేవి ప్రాజెక్టు తెచ్చినాను అని మరియు నియోజకవర్గం లో 3600 కోట్లతో అభివృద్ధి కార్యక్రమలు చేశానని, వైసీపీ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా అభివృద్ధి అనే మాట లేదు అని మరియు కావున రెండు నెలలలో జరగబోయే ఎన్నికలలో ప్రతి ఒక్కరూ కలిసి మీ గ్రామాలకు కలసి వచ్చి తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించలని ఉదయగిరిలో తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఉదయగిరిలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే విధంగా పరిశ్రమ తీసుకొస్తానని ఉదయగిరిని పర్యటక రంగంగా చేస్తానని ఆగిన అభివృద్ధిని కొనసాగిస్తానని తెలిపారు అదేవిధంగా బెంగళూరులో నివసిస్తున్న ఉదయగిరి ప్రాంత వాసులకు అందుబాటులో ఉండి ఏ కష్టం వచ్చినా ముందు ఉంటానని తెలిపారు కావునా ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేసి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ని అత్యధిక మెజార్టీతో గెలిపించలని తెలిపినారు కార్యక్రమంలో బొల్లినేని కుమారుడు ధనుష్ మాట్లాడుతూ రాబోయే ఎలక్షన్ కోడ్ లోపు నాన్న గారి చేతులమీదుగా 25 -30 మందికి ఉపాధి కల్పించే విధంగా ఒక సాఫ్ట్వేర్ రంగాన్ని ఏర్పాటు చేస్తానని తెలిపినారు *కార్యక్రమ నిర్వాహకులు* మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నేటి వెంకట రెడ్డి, దుత్తలూరు మండల పార్టీ అధ్యక్షులు పేలపూడి వెంకటరత్నం, కోన్ల వెంకటేశ్వర్లు(KVR), మరియు కార్యక్రమం లో నియోజకవర్గ పరిశీలకులు వికాస్ హరి కృష్ణ వరికుంటపాడు మండల పార్టీ అధ్యక్షులు మధు, ఓంకార్, దుత్తలూరు మాజీ ఎంపీపీ రవీంద్రబాబు జనసేన, చింతల శ్రీనివాసులు నియోజకవర్గ పరిశీలకులు వెంకటేశ్వర్లు, రవీంద్ర తదితర తెలుగుదేశం పార్టీ జనసేన ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi